Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐదుగురు చిన్నారులపై ఐదుగురు మైనర్లు అత్యాచారం.. ఎక్కడ?

victim
, బుధవారం, 3 మే 2023 (11:17 IST)
తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. ఐదుగురు చిన్నారులపై ఐదుగురు మైనర్ బాలుర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాష్ట్రంలోని విల్లుపురం జిల్లాలో వెలుగు చూసింది. పోలీసులు వెల్లడించిన కథనం మేరకు.. 
 
జిల్లాలోని జానకీపురం సమీపంలో ఓ చిన్నారి రెండో తరగతి చదువుతుంది. ప్రతి రోజూ ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండే చిన్నారి ఉన్నట్టుండి అనారోగ్యానికి గురైంది. దీంతో ఏం జరిగిందని చిన్నారి వద్ద క్లాస్ టీచర్ ఆరా తీసింది. ఆ బాలిక మాటలను బట్టి ఆ చిన్నారి లైంగిక దాడికి గురైనట్టు గుర్తించింది. ఈ విషయాన్ని ఆమె జిల్లా బాలల భద్రతా అధికారి దృష్టికి తీసుకెళ్లారు. 
 
దీంతో అక్కడకు చేరుకున్న బాలల సంక్షేమ విభాగం అధికారులు ఆ బాలిక వద్ద ఆరా తీయగా, అసలు విషయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత ఆ బాలికకు వైద్య పరీక్షలు చేయించగా, అత్యాచారానికి గురైనట్టు తేలింది. ఆ బాలిక నివసించే ప్రాంతానికి చెందిన 14 నుంచి 17 యేళ్ల మధ్య వయసున్న నలుగురు మైనర్లు ఈ అత్యాచారానికి పాల్పడినట్టు తేలింది. ఈ ఒక్క బాలికనే కాకుండా మరో నలుగురు బాలికలపై కూడా అత్యాచారానికి పాల్పడినట్టు విచారణలో వెల్లడైంది. దీంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకుని జునైల్ హోంకు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉరిశిక్షలకు ప్రత్యామ్నాయం లేదా? సుప్రీంకోర్టు ప్రశ్న