Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉరిశిక్షలకు ప్రత్యామ్నాయం లేదా? సుప్రీంకోర్టు ప్రశ్న

supreme court
, బుధవారం, 3 మే 2023 (10:38 IST)
తీవ్ర నేరాలకు పాల్పడి ఉరిశిక్ష పడే ఖైదీలను చివరి క్షణాల్లో నొప్పి కలగకుండా అంటే ఉరి వేసి చంపకుండా ఉండేలా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు లేవా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మరణశిక్షను ఉరి తీయడం రూపంలోనే అమలు చేయాలా అని అడిగింది. దీనికి వేరే విధానం లేదా అని ప్రశ్నించింది. దీనికి కేంద్రం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. 
 
ఉరికొయ్యకు వేలాడదీయడం కన్నా తక్కువ బాధను కలిగించే ఇంజెక్షన్లు ఇవ్వడం, షూట్ చేయడం, కరెంటు షాకు ఇవ్వడం, గ్యాస్ ఛాంబర్లలో పెట్టడం వంటి ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేయాలని కోరుతూ న్యాయవాది రిషి మల్హోత్రా 2017లో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసును తాజాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్టీవాలాల ధర్మాసనం విచారణకు చేపట్టింది. 
 
కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సమాధానం చెబుతూ దీనిపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేసే అలోచన ఉందని, ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. నిపుణులను ఎంపిక చేసే పనిలో ఉన్నామన్నారు. దీంతో తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాత చేపట్టనున్నట్టు కోర్టు ప్రకటించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మండే ఎండలో 'గోల్డ్ గుల్ఫీ' అమ్ముతున్నాడు.. ఎక్కడో తెలుసా?