Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (22:19 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. పటాన్‌చెరు మండలం పాశమైలారంలో ఈ పారిశ్రామికవాడ ఉంది. ఇక్కడ శనివారం మధ్యాహ్నం సమయంలో ఉన్నట్టుండ మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ముందుగా పెయింట్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. వాటిని అపుదులో చేయలేకపోవడంతో పక్కనే ఉన్న రసాయన పరిశ్రమకు వ్యాపించాయి. 
 
దీంతో రసాయనాలతో కూడిన డ్రమ్ములకు మంటలు అంటుకున్నాయి. మంటలు రసాయన పరిశ్రమ అంతటికి వ్యాపించడంతో యంత్రాలన్నీ మంటల్లో కాలిపోయాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు సంగారెడ్డి, పటాన్‌చెరు, బీడీఎల్‌, బొల్లారం ప్రాంతాలకు చెందిన అగ్నిమాపక శకటాలు మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నాయి. భారీ స్థాయిలో అగ్ని ప్రమాదం జరగడంతో పరిశ్రమల చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments