రంగారెడ్డి జిల్లాలో దారుణం.. వెయ్యి రూపాయల కోసం హత్య.. శవాన్ని డ్రమ్‌లో దాచి..?

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (15:23 IST)
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వెయ్యి రూపాయల కోసం స్నేహితుడిని దారుణంగా హత్యచేశాడు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా, చౌదరిగూడెం మండలం కాసులబాద్ గ్రామానికి చెందిన ఆంజనేయులు, రాజు అనే ఇద్దరు వ్యక్తులు స్నేహితులు.. ఇద్దరు కలిసి మద్యం తాగుతూ ఉండేవాళ్లు. వారం రోజుల క్రితం రాత్రి సమయంలో ఇద్దరు కలిసి మద్యం తాగి ఆంజనేయులు ఇంట్లో పడుతుకున్నారు. అయితే, మరుసటిరోజు ఆంజనేయులు నిద్రలేసేలోపే.. రాజు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.. ఆంజనేయులు ఇంట్లో దాచుకున్న వెయ్యి రూపాయలు మాయం అయ్యాయి.
 
ఇక, ఈ విషయంపై ఆంజనేయులు.. రాజును అడిగితే తాను తీయలేదని చెప్పినా.. మూడు రోజులు కనిపించకుండా పోయాడు. తిరిగి ఆగస్టు 15న ఇద్దరు కలుసుకున్నారు. మళ్లీ డబ్బుల గురించి ఆరా తీసినా పాత సమాధానమైన ఎదురైంది. ఇక, ఆ రాత్రి ఆంజనేయులు ఇంట్లోనే పడుకున్నారు రాజు నిద్రిస్తున్న సమయం చూసి తలపై కొట్టడంతో.. రాజు అక్కడికక్కడే మృతిచెందాడు. 
 
ఇక, ఏం చేయాలో తెలియక ఓ రోజు శవాన్ని డ్రమ్‌లో దాచాడు. మరుసటి రోజు మృతదేహాన్ని మూడు ముక్కలు చేశాడు. తలను ఓ దగ్గర, మొండెం మరో దగ్గర.. కాళ్ల భాగాన్ని ఇంకో దగ్గర పడేశాడు. ఇదే సమయంలో.. తన పర్సును కూడా పారేసుకున్నాడు.. పర్సు ఆధారంగా కేసును చేధించిన పోలీసులు.. ఆంజనేయులను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

Aishwarya Rajesh : శుభప్రదం గా ప్రారంభించిన ఐశ్వర్య రాజేష్, రితిక నాయక్

Mahesh Babu: మహేష్ బాబు లాంచ్ చేసిన జటాధార ట్రైలర్.. రక్తం త్రాగే పిశాచిగా సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments