Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత నానమ్మను పెట్రోల్ పోసి తగులబెట్టిన మనవడు..

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (19:38 IST)
పదో తరగతి చదువుతున్న కుర్రాడు.. ఆస్తి కోసం ఘాతుకానికి ఒడిగట్టాడు. సొంత నానమ్మను పెట్రోల్ పోసి తగులబెట్టాడు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలో ఈ ఘోరం జరిగింది. ఎలవర్తి గ్రామానికి చెందిన ఓ బాలుడు స్థానికంగా పదో తరగతి చదువుతున్నాడు. ఐతే ఇటీవల అతడి నానమ్మ కంసమ్మ.. తన ఆస్తిలోని కొంత భాగాన్ని కూతుళ్ల పేరిట రిజిస్టర్ చేయించింది. 
 
అప్పటి నుంచి నానమ్మపై ఆ బాలుడు పగ పెంచుకున్నాడు. తనకు రావాల్సిన ఆస్తిని మేనత్తలకు కట్టబెట్టడంపై ఆగ్రహంతో రగిలిపోయాడు. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం ఇంట్లోనే నానమ్మపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. 
 
తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఇంటి నుంచి మంటలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా.. అప్పటికే ఇంటి గుమ్మం వద్ద కాలిపోయిన స్థితిలో కంసమ్మ మృతదేహం కనిపించింది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న బాలుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments