Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైల్లో నా భర్తకు ప్రాణహాని వుంది : హైకోర్టును ఆశ్రయించిన రాజాసింగ్ భార్య

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (11:08 IST)
తన భర్తకు ప్రాణహాని ఉందని, అందువల్ల ఆయనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సతీమణి ఉషాబాయి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై ఆమె తెలంగాణ హైకోర్టులో ఏ పిటిషన్ దాఖలు చేశారు. 
 
పదే పదే మతపరమైన వ్యాఖ్యలు చేసి శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారన్న కారణంగా రాజాసింగ్‌ను పీడీ చట్టం కింద నిర్బంధంలోకి తీసుకున్న విషయం విదితమే. దీనిని సవాలు చేస్తూ ఇప్పటికే రాజాసింగ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, ఆయనను ప్రత్యేక తరగతి ఖైదీగా గుర్తించి వసతులు కల్పించాలని భార్య తాజాగా పిటిషన్‌ వేశారు. 
 
ప్రత్యేక గది, మంచం, టేబుల్‌, కుర్చీ, వార్తాపత్రికలు, టీవీ, వంట చేసుకోవడానికి తగిన సౌకర్యాలు కల్పించాలని కోరారు. జైలులో ఆయన ప్రాణాలకు ప్రమాదం పొంచివుందని, ఇతర ఖైదీలకు దూరంగా ఉంచాలని కోరారు.
 
ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కన్నెగంటి లలిత విచారణ చేపట్టగా వాదనలు వినిపించడానికి గడువు కావాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోరడంతో విచారణను 28కి వాయిదా వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments