Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైల్లో నా భర్తకు ప్రాణహాని వుంది : హైకోర్టును ఆశ్రయించిన రాజాసింగ్ భార్య

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (11:08 IST)
తన భర్తకు ప్రాణహాని ఉందని, అందువల్ల ఆయనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సతీమణి ఉషాబాయి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై ఆమె తెలంగాణ హైకోర్టులో ఏ పిటిషన్ దాఖలు చేశారు. 
 
పదే పదే మతపరమైన వ్యాఖ్యలు చేసి శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారన్న కారణంగా రాజాసింగ్‌ను పీడీ చట్టం కింద నిర్బంధంలోకి తీసుకున్న విషయం విదితమే. దీనిని సవాలు చేస్తూ ఇప్పటికే రాజాసింగ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, ఆయనను ప్రత్యేక తరగతి ఖైదీగా గుర్తించి వసతులు కల్పించాలని భార్య తాజాగా పిటిషన్‌ వేశారు. 
 
ప్రత్యేక గది, మంచం, టేబుల్‌, కుర్చీ, వార్తాపత్రికలు, టీవీ, వంట చేసుకోవడానికి తగిన సౌకర్యాలు కల్పించాలని కోరారు. జైలులో ఆయన ప్రాణాలకు ప్రమాదం పొంచివుందని, ఇతర ఖైదీలకు దూరంగా ఉంచాలని కోరారు.
 
ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కన్నెగంటి లలిత విచారణ చేపట్టగా వాదనలు వినిపించడానికి గడువు కావాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోరడంతో విచారణను 28కి వాయిదా వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments