వైకాపా నేతను లారీతో ఢీకొట్టించి చంపిన దండగులు

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (10:43 IST)
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో దారుణం జరిగింది. అధికార వైకాపా నేతను కొందరు దుండగులు లారీతో ఢీకొట్టించి హత్య చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవి హింసాత్మకంగా మారే అవకాశం ఉండటంతో అదనపు బలగాలను మొహరించారు. 
 
పాతకక్షల నేపథ్యంలో వైకాపా నేత పసుపులేటి రవితేజను కొందరు దండుగులు గురువారం  కొందరు దండగులు లారీతో ఢీకొట్టించి హత్య చేశారు. ఈ విషయం తెలియడంతో సింగరాయకొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితులు హత్యకు ఉపయోగించిన లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఠాణాకు తరలించారు. 
 
మరోవైపు, తమ పార్టీ నేత హత్యకు నిరసంగా వైకాపా శ్రేణులు ఆందోళనకు దిగారు. వీరిపై పోలీసులు తమ లాఠీలను ఝుళిపించారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితులు అదుపతప్పాయి. లారీకి నిప్పు పెట్టిన ఆందోళనకారులు పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా ఉన్న చలివేంద్రాన్ని కూడా తగలబెట్టారు. ఈ ప్రాంతంలో డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు బందోబస్తును నిర్వహిస్తున్నారు. వైకాపా నేతల ఆందోళనలు హింసాత్మకంగా మారకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ ప్రోమో

'థామా' నుంచి నువ్వు నా సొంతమా పాట రిలీజ్

Geethamadhuri : కానిస్టేబుల్ లో గీతామాధురి పాడిన ధావత్ సాంగ్ కు ఆదరణ

Dil Raju: తేజసజ్జా తో దిల్ రాజు చిత్రం - ఇంటికి పిలిచి ఆత్మీయ వేడుక జరిపాడు

Anupam Kher: కాంతార ఛాప్టర్ 1 చూశాక మాటలు రావడంలేదు : అనుపమ్ ఖేర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments