Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రజలకు కరెంట్ షాక్ - చార్జీల పెంపునకు రంగం సిద్ధం

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (12:48 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కరెంట్ షాక్ తగలనుంది. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచేందుకు ఆ రాష్ట్ర విద్యుత్ బోర్డు సిద్ధమైంది. ఇప్పటికే కొత్త విద్యుత్ టారిఫ్‌లను విద్యుత్ ఉత్పత్తి రంగ సంస్థలు ప్రతిపాదించి ప్రభుత్వానికి సమర్పించాయి. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన మరుక్షణమే విద్యుత్ చార్జీల పెంపుపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుంది. 
 
తాజాగా చేసిన ప్రతిపాదనల మేరకు... గృహ వినియోగదారులపై యూనిట్‌కు 50 పైసలు, వాణిజ్య వినియోగదారులపై ఒక్క రూపాయి చొప్పున పెంచేలా ప్రతిపాదించారు. ఈ మేరకు ఎలక్ట్రిక్ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ)కి డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించింది. 
 
తెలంగాణాలోని విద్యుత్ డిస్కంలు దాదాపు 10 వేల కోట్ల లోటుతో నడుస్తున్నాయి. ఈ నష్టంలో కొంతైనా భర్తీ చేసుకునేందుకు వీలుగా ఇపుడు విద్యుత్ చార్జీలను పెంచాలని డిస్కంలు కోరుతున్నాయి. రైల్వే చార్జీలు, బొగ్గు రవాణా చార్జీలు పెరగడంతో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యమైందని విద్యుత్ అధికారులు సెలవిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆపరేషన్ సిందూర్ ఆపలేదు.. కొనసాగుతుంది : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments