Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీలో విషం కలుపుకుని తిని ప్రాణాలు విడిచారు...

తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి యాదాద్రి జిల్లాలోని రాజాపేట మండలం పాముకుంటలో శుక్రవారం ఉదయం ఓ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మొత్తం కుటుంబంలోని ఏడుగురు చనిపోయారు.

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2017 (09:14 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి యాదాద్రి జిల్లాలోని రాజాపేట మండలం పాముకుంటలో శుక్రవారం ఉదయం ఓ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మొత్తం కుటుంబంలోని ఏడుగురు చనిపోయారు. ఆ ఏడుగురు విషప్రయోగం వల్లే మృతిచెందినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వెల్లడైంది. 
 
ఘటనా స్థలంలో విషం సీసా కనిపించడంతో అన్నంలో విషం కలుపుకుని తిని కుటుంబం చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అసలు విషం తాగాల్సిన బాధ ఏమై ఉంటుందో వెల్లడి కావాల్సి ఉంది. 
 
సిద్దిపేట జిల్లా మునిగడప నుంచి బాధిత కుటుంబం యాదాద్రి జిల్లాకు వలసొచ్చింది. ఫౌల్ట్రీఫామ్‌లో కూలీలుగా పనికి కుదిరారు. ఊరి వారితో కలిసిమెలిసి ఉంటున్న ఈ కుటుంబ సభ్యులు ఇలా శవాలుగా కనిపించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. అప్పుల బాధతోనే ఇంటి పెద్ద ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చనే వాదనా వినిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments