Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ఇకపై శనివారాల్లోనూ పాస్‌పోర్టు సర్వీసులు

Webdunia
ఆదివారం, 28 ఆగస్టు 2022 (11:39 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఇకపై శనివారాల్లో కూడా పాస్‌పోర్టు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇకపై మరింత వేగంగా పాస్‌పోర్టు పొందే అవకాశం ఉంది. తొలి దశలో నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ నగరాల్లోని కార్యాలయాలు కూడా శనివారాల్లో పనిచేస్తాయి.  
 
ప్రస్తుతం ఈ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా వారంలో ఐదు రోజులు మాత్రమే పనిచేస్తున్నాయి. సెప్టెంబరు మూడో తేదీ నుంచి శనివారాల్లో కూడా పని చేయనున్నాయి. ఈ విషయాన్ని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రం అధికారి దాసరి బాలయ్య వెల్లడించారు. విదేశాలకు వెళ్లందుకు పాస్‍‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారు వారాల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా పరిశీలనకు మూడు వారాల సమయం పడుతుంది.
 
ఈ నేపథ్యంలో ఇటీవల ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాన్ని సందర్శించిన వీసా, పాస్‌పోర్టు విదేశీ మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎ.సయీద్ దృష్టికి అధికారులు ఈ విషయాన్ని తీసుకెళ్ళగా ఆయన సానుకూలంగా స్పందించి, శనివారం కూడా ఈ కేంద్రాలు పని చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీచేశారని తెలిపారు. దీంతో వచ్చే నెల 3వ తేదీ నుంచి హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం పరిధిలోని టోలీచౌకి, బేగంపేట, అమీర్‌పేట, నిజామాబాద్, కరీంనగర్ పాస్‌పోర్టు కేంద్రాలు ప్రతి శనివారం తెరుచుకుంటాయని దాసరి బాలయ్య వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments