Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇందల్వాయి టోల్‌గేట్ వద్ద కాల్పుల కలకలం

Webdunia
సోమవారం, 29 మే 2023 (16:38 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి టోల్‌గేట్‌ వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. తన వాహనంపై దొంగలు దూసుకురావడంతో.. ఆత్మరక్షణ కోసం ఎస్ఐ గాల్లోకి కాల్పులు జరిపారు. సోమవారం ఈ ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముప్కాల్ మండలంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కాపర్‌ కాయిల్‌ చోరీ చేసిన అంతర్‌రాష్ట్ర ముఠా 44వ జాతీయ రహదారి మీదుగా వెళ్తోందని పోలీసులకు ఆదివారం అర్థరాత్రి సమాచారం వచ్చింది. దీంతో ఇందల్వాయి ఎస్ఐ నరేశ్, దర్పల్లి ఎస్ఐ వంశీకృష్ణా రెడ్డి ఇందల్వాయి టోల్‌గేటు వద్ద వాహనాలను తనిఖీ చేశారు.
 
ఆ సమయంలో పోలీసులను చూసిన దొంగల ముఠా అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తమ కారుతో దర్పల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం ఎస్ఐను సైతం ఢీకొట్టేందుకు రావడంతో ఆత్మరక్షణ కోసం ఆయన రెండు సార్లు గాల్లో కాల్పులు జరిపారు. దీంతో దుండగులు పక్కవైపు నుంచి పారిపోయినట్లు ఇందల్వాయి ఎస్ఐ నరేశ్‌ తెలిపారు. అంతర్‌రాష్ట్ర ముఠాపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments