Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్‌లో స్వలింగ వివాహం : భర్తకు విడాకులిచ్చి మరో మహిళను పెళ్లాడిన వివాహిత

Webdunia
సోమవారం, 29 మే 2023 (16:08 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఇద్దరు మహిళలు వివాహం చేసుకున్నారు. ఈ స్వలింగ వివాహం తాజాగా వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్తకు విడాకులు ఇచ్చిన ఓ వివాహిత.. తన మనస్సుకు నచ్చిన ఓ మహిళను పెళ్లి చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగాల్ రాష్ట్రానికి చెందిన మౌసుమి దత్తా, మౌమిత అనే ఇద్దరు మహిళలు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. మౌసుమి దత్తాకు ఇప్పటికే పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, పిల్లలను తన పిల్లలుగా స్వీకరించేందుకు మౌమిత అంగీకరించింది. దీంతో తన భర్తకు మౌసుమి విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత మౌసుమి, మౌమిత ఇద్దరూ కలిసి ఓ గుడిలో స్వలింగ వివాహాన్ని చేసుకున్నారు. 
 
దీనిపై మౌమిత స్పందిస్తూ, ప్రేమ అనేది స్త్రీ పురషుల మధ్యే కాకుండా ఇద్దరు స్త్రేలు, ఇద్దరు మహిళల మధ్య కూడా చిగురిస్తుందన్నారు. మౌసుమిని వివాహం చేసుకోవడం తన కుటుంబానికి ఇషఅటం లేదని అందుకే తన ప్రియురాలితో కలిసి అద్దె ఇంట్లో కాపురం పెట్టానని తెలిపారు. మౌసుమి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనని తెలిపారు. మరోవైపు మౌసుమి మాట్లాడుతూ, తన భర్త రోజూ తనను చిత్ర హింసలకు గురిచేసేవాడని, అందుకే ఆయన నుంచి విడిపోయినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments