Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదోసారి అమ్మాయి పుట్టిందని.. పాలుపట్టని కసాయి తల్లి..

Webdunia
బుధవారం, 9 జనవరి 2019 (15:48 IST)
ఆరుగురు అమ్మాయిలు... ముగ్గురు అబ్బాయిలు కలిగిన ఆ దంపతులకు అబ్బాయి కోసం తాపత్రయం మాత్రం తగ్గలేదు. పదోసారి మరో అబ్బాయి కోసం ప్రయత్నించిన ఆ దంపతులకు మళ్లీ ఆడపిల్లే పుట్టింది. కానీ పదోసారి పుట్టిన ఆ ఆడబిడ్డకు కన్నతల్లే పాలు పట్టలేదు.


బిడ్డ ఎలా వుందో చూసేందుకు కుటుంబీకులే రాలేదు. బిడ్డ పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్నా పాలిచ్చేందుకు ఆ తల్లి ముందుకు రాలేదు. ఈ అమానుష ఘటన నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. చందంపేట మండలం మోత్య తండాకు చెందిన ఇస్లావత్- సావిత్రిరాజు దంపతులకు తొమ్మిది మంది సంతానం వున్నారు. మంగళవారం సావిత్రి పదో సారిగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టింది అబ్బాయి కాదని.. అమ్మాయేనని తెలుసుకున్న సావిత్రితో పాటు ఆమె కుటుంబ సభ్యులు నవజాత శిశువుకు శత్రువుగా మారిపోయారు. ఎవ్వరూ ఆ బిడ్డను కన్నెత్తిచూడలేదు. 
 
ఇంకా ఆ బిడ్డ పాలకోసం గుక్కపెట్టి ఏడుస్తున్నా.. పాల పట్టకుండా ఆ తల్లి కూర్చుండిపోయింది. చివరికి పక్కనుండే వారు పోతపాలు పట్టి చిన్నారి ఆకలి తీర్చారు. బిడ్డను విక్రయించేందుకు చిన్నారి తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నాలు తెలియడంతో ఐసీడీఎస్ సూపర్ వైజర్ వెంకటమ్మ ఆసుపత్రికి చేరుకుని మందలించారు.

చిన్నారి కనిపించకపోయినా, ఆమెకేమన్నా జరిగినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చివరికి పోలీసుల జోక్యంతో చిన్నారిని ఇంటికి తీసుకెళ్లేందుకు సావిత్రి కుటుంబీకులు అంగీకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాబిలమ్మ నీకు అంతా కోపమా సినిమాని సపోర్ట్ చేయండి : జాన్వీ నారంగ్

కళ్యాణ్‌జీ గోగన తెరకెక్కించిన మారియో నుంచి వాలెంటైన్స్ డే పోస్టర్

Nandamuri Balakrishna: థమన్‌కు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ (video)

మెగా అభిమానులకు ఫీస్ట్ లా చిరంజీవి విశ్వంభర తాజా అప్ డేట్

మ్యూజికల్ డ్రామాలో అనిరుధ్ మ్యాజిక్ చిత్రం నుంచి గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments