Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామాజిక న్యాయం కోసమే ఓబీసీ రిజర్వేషన్లు : ప్రధాని నరేంద్ర మోడీ

Webdunia
బుధవారం, 9 జనవరి 2019 (13:44 IST)
సామాజిక న్యాయం కోసంమే అగ్రకులాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. ఓబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రధాని మోడీ సర్కారు లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే. ఈ బిల్లు బుధవారం రాజ్యసభకు వచ్చింది. అయితే, ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు.
 
ఇదిలావుంటే, మహారాష్ట్రలోని సోలాపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని మాట్లాడుతూ, ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల్లోని పేదలకు సామాజిక న్యాయం దక్కాలన్న ఉద్దేశ్యంతోనే ఈ బిల్లును తీసుకొచ్చినట్టు తెలిపారు.
 
ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలుపగా, రాజ్యసభలోనూ ఆమోదం పొందుతున్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. అన్యాయం జ‌రిగింద‌న్న భావ‌న పోతుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తంచేశారు. అంద‌రికీ స‌మాన అవ‌కాశాలు కావాలన్నారు.
 
ఈబీసీ బిల్లు ప్ర‌కారం.. పేద అగ్ర‌కుల‌స్థుల‌కు జ‌న‌ర‌ల్ క్యాట‌గిరీలో 10 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌నున్నారు. రాజ్య‌స‌భ‌ను ఒక రోజు పొడిగించామ‌ని, బ‌హుశా బిల్లును పాస్ చేస్తార‌ని ఆశిస్తున్నాను, ప్ర‌జ‌ల ఆశ‌యాల‌ను గౌర‌విస్తార‌ని భావిస్తున్నాన‌ని, సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని స‌భ్యులు ఈబీసీ బిల్లుకు ఆమోదం తెలుపుతార‌ని ఆశిస్తున్న‌ట్లు ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments