Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ కొనివ్వకపోవడంతో తల్లినే చంపేశాడు.. ఎక్కడ?

Webdunia
శనివారం, 26 మార్చి 2022 (20:46 IST)
స్మార్ట్ ఫోన్ లేనిదే పొద్దు గడవట్లేదు చాలామంది. అదీ కరోనా కాలంలో స్మార్ట్ ఫోన్ లేనిదే ఏ పని జరగట్లేదు. కరోనా కారణంగా ఆన్‌లైన్ క్లాసుల పుణ్యమా అని ఇప్పుడు చిన్నపిల్లలూ స్మార్ట్ ఫోన్‌లకు అలవాటయ్యారు. ఆ అలవాటే ఓ యువకుడిని నేరస్థుడిగా మార్చింది. 
 
సెల్ ఫోన్ కొనివ్వాలంటూ ఓ యువకుడు తన తల్లిని దారుణంగా హత్య చేశాడు. రోకలితో తలపై కొట్టి మరీ అంతమొందించాడు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఉండవల్లి మండలంలోని శేరిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి, వెంకటేశ్వర్లు దంపతులకు ఇద్దరు కుమారులు. లక్ష్మి వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. పెద్ద కుమారుడు మహేశ్‌ ఇంటర్‌ పూర్తి చేశాడు.  
 
ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వాలని తల్లిని కోరాడు. డబ్బులు లేవని, తర్వాత కొనిస్తానని తల్లి చెప్పింది. కానీ స్మార్ట్ ఫోన్ కొనివ్వాల్సిందేనని పట్టుబట్టాడు. ఈ విషయంపై తల్లీ కుమారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. 
 
ఈ క్రమంలో శుక్రవారం మరోసారి తల్లితో గొడవపడ్డాడు. ఆవేశంతో రోకలిబండతో తల్లి తలపై కొట్టాడు. ఆమె తీవ్రగాయాలపాలై మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments