Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎం-కేర్స్ నిధికి విరాళంగా కోటిరూపాయలు, ఒకనెల వేతనం

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (23:02 IST)
దేశవ్యాప్తంగా “లాక్‌డౌన్” నేపథ్యంలో పునరావాస కార్యక్రమాల కోసం ఉద్దేశించిన “పీఎం-కేర్స్ ప్రత్యేక నిధి”కి ఎంపీల్యాడ్స్ నుంచి కోటి రూపాయలతోపాటు, తన ఒకనెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు.
 
2020-21 సంవత్సరానికి “ఎంపీ ల్యాడ్స్” నిధులనుంచి ఆ కోటి రూపాయలను కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర “ముఖ్యమంత్రి సహాయ నిధి”కి రూ.50 లక్షలు, తన పార్లమెంటరీ నియోజకవర్గమైన సికింద్రాబాద్‌లో “కరోనా” సహాయ కార్యక్రమాల కోసం మరో రూ.50లక్షలను కూడా ఇస్తున్నట్లు తెలిపారు.
 
దీనికి సంబంధించిన లేఖలను ఎం‌పి లాడ్స్ కమిటీ ఛైర్మన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, హైదరాబాద్ కలెక్టర్‌లకు పంపించారు. ప్రస్తుతం దేశం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రజలు కూడా తమకు తోచినంత మొత్తాన్ని “పీఎం-కేర్స్ నిధి”కి విరాళాల రూపంలో అందజేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments