Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రికి ఐఎఎస్ అధికారుల సంఘం రూ. 20 లక్షల విరాళం అందజేత

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (22:47 IST)
కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు బాసటగా నిలుస్తూ ఐఎఎస్ అధికారుల సంఘం ప్రకటించిన ఇరవై లక్షల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందించారు.

ఐఎఎస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి, పర్యాటక, భాషా సాంస్కృతిక, క్రీడా యువజనాభ్యుదయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో పలువురు సీనియర్ ఐఎఎస్ అధికారులు గురువారం తాడేపల్లి  క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఇందుకు సంబంధించిన పత్రాన్ని అందించారు. 
 
ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 162 ఐఎఎస్ అధికారులు తమ మూడు రోజుల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చేందుకు ముందుకు రాగా, ఆ మొత్తం రూ.20 లక్షలుగా ఉంది. 
 
ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నిరోధానికి ముఖ్యమంత్రి విభిన్న కార్యక్రమాలు చేపట్టేలా ఐఎఎస్ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేస్తున్నారని, వాటిని అమలు చేయటంతో తమ శక్తి వంచన లేకుండా పనిచేస్తామని పేర్కొన్నారు. సిఎంను కలిసిన వారిలో సీనియర్ ఐఎఎస్ అధికారులు ఎస్ఎస్ రావత్, విజయకుమార్, ప్రధ్యుమ్న తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments