Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్చిలో పెళ్లి.. వరుడు మోసం చేశాడని ఓ యువతి పెళ్లిని ఆపేసింది..

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (20:52 IST)
ప్రస్తుతం పెళ్లిళ్లు పీటలవరకు వచ్చి ఆగిపోవడం ఫ్యాషనైపోయింది. మొన్నటికి మొన్న తాళికట్టే సమయంలో ఓ వధువు ప్రియుడొస్తున్నాడని.. అతనితో తన పెళ్లి జరగాలంటూ పట్టుబట్టి పెళ్లి ఆపేసింది. ప్రస్తుతం సికింద్రాబాద్‌లో కూడా ఓ సంఘటన చర్చిలో జరగాల్సిన పెళ్లిని ఆగిపోయేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ వెస్లీ చర్చిలో పెళ్లి జరుగుతోంది. ఇరు కుటుంబ సభ్యులంతా వివాహానికి హాజరయ్యారు. 
 
జనగామ జిల్లాకు చెందిన అనిల్‌తో హైదరాబాద్ తుకారాంగేట్‌కు చెందిన యువతితో చర్చ్ ఫాదర్లు వివాహం జరిపిస్తున్నారు. ఇంతలో ఓ యువతి అక్కడ ప్రత్యక్షమై.. అనిల్‌ తనను ప్రేమించి మోసం చేశాడంటూ పెళ్లిని అడ్డుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు చర్చ్ బిల్డింగ్ దగ్గరకు చేరుకుని యువతిని ప్రశ్నించారు. పెళ్లి ఆపిన యువతి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు తిప్పి పంపేశారు.
 
మరోవైపు పెళ్లి చేసుకోబోతున్న తుకారాంగేట్‌కు చెందిన వధువు కూడా మైనర్ కావడంతో చైల్డ్‌లైన్ కో ఆర్డినేటర్ పెళ్లిని ఆపేశారు. అనంతరం మోండా మార్కెట్‌ పోలీస్ స్టేషన్‌లో చైల్డ్‌లైన్, ఐసీడీఎస్‌ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో పెళ్లికి వచ్చిన వారంతా చేసేదేమీలేక ఎవరి ఇళ్లకు వారు వెనుదిరిగారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments