Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఔను... నేనే గర్భవతిని చేసింది... కోర్టుకు చెప్పిన యువకుడు.. బెయిల్ మంజూరు!

ఔను... నేనే గర్భవతిని చేసింది... కోర్టుకు చెప్పిన యువకుడు.. బెయిల్ మంజూరు!
, ఆదివారం, 8 నవంబరు 2020 (16:23 IST)
ఓ యువతిని గర్భవతిని చేసి మోసం చేసిన కేసులో అరెస్టు అయిన ఓ యువకుడు.. కోర్టులో మాత్రం నేరాన్ని అంగీకరించారు. పైగా, తన చేతిలో మోసపోయిన యువతిని పెళ్లి చేసుకునేందుకు సమ్మతించాడు. దీంతో ఆ యువకుడిని హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు, ఓ బాలిక గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలో వారిద్దరూ హద్దులు దాటి శారీరకంగా ఒక్కటయ్యారు. దీంతో బాలిక గర్భందాల్చింది. విషయం తెలుసుకున్న యువకుడు ఆమెను పెళ్ళి చేసుకోకుండా దూరం పెట్టాడు. దీంతో బాధితురాలు పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు పెట్టారు.
 
మూడు నెలల పాటు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. తన క్లయింట్, బాధితురాలు ప్రేమించుకున్నారని, ఆమెకు అన్యాయం చేయాలని భావించడం లేదని, వివాహం చేసుకుంటానని క్లయింట్ అంటున్నాడని, అతని తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. 
 
ఆమెకు వచ్చే సంవత్సరం 18 సంవత్సరాలు నిండుతాయని, ఆపై అక్టోబరు 10లోపు వివాహం చేసుకుంటాడని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, నిందితుడికి బెయిల్‌ను మంజూరుచేస్తున్నట్టు తెలిపారు. పెళ్లి చేసుకున్న వెంటనే వివాహ సర్టిఫికెట్‌ను పోలీసు స్టేషన్‌లో సమర్పించాలని ఆదేశించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాతో ఆటలు కాదు.. ఓసారి గెలిచి మరోసారి ఓడిన యువ డాక్టర్!