ఖైరతాబాద్ గణేషుడికి లాక్ డౌన్ ఎఫెక్ట్?

Webdunia
మంగళవారం, 12 మే 2020 (20:39 IST)
ఖైరతాబాద్ గణేషుడికి లాక్ డౌన్ ఎఫెక్ట్ తగిలింది. ఈసారి ఆయన విశ్వరూప దర్శనం అనుమానంగానే వుంది. తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేశ్‌కు ప్రత్యేక స్థానం ఉన్న విషయం తెలిసిందే.

రూపంలో ఏటికేడు కొత్తదనం సంతరించుకుంటూ కనువిందు చేసే ఈ భారీ గణేశుడిని చూడటానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఒక్క అడుగు ఎత్తులోనే గణేషుడి విగ్రహం ఉండనుందని సమాచారం.

ఈ ఏడాది ఆగస్ట్ 22న వినాయక చవితి వస్తున్న విషయం తెలిసిందే. గణేశ్ తయారీలో తొలి ఘట్టమైన కర్రపూజను మే 18న సాయంత్రం 5 గంటలకు జరపనున్నారు. అదే రోజు గణేశుడిపై ప్రకటన చేయనున్నట్టు ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్ తెలిపారు. గతేడాది గణేశుడు 61 అడుగుల ఎత్తులో ఏర్పాటైన విషయం తెలిసిందే.

ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా దర్శన మిచ్చాడు. 1954 నుంచి గణేశుడు ఒక్కో అడుగు పెరుగుకుంటూ వస్తున్నాడు. కోటి రూపాయలతో రూపుదిద్దుకున్న గణేశుడి కోసం 100 మందికి పైగా కళాకారులు నాలుగు నెలలు కష్టపడి తయారు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Vishnu: శ్రీవిష్ణు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ మృత్యుంజ‌య్‌ రిలీజ్ డేట్

Devisri: ఉస్తాద్ భగత్ సింగ్ లో రెండు అదిరిపోయే పాటలు రాబోతున్నాయి

లోకేష్ కనకరాజ్ కూలీ సినిమాపై సౌందర్య రజనీకాంత్ ఏమన్నదో తెలుసా?

తెలిసినవారికి వివరణ అవసరం లేదు, చెప్పినా వినరు : ఏఆర్ రెహమాన్

ప్రభాస్ ఖాతాలో అరుదైన రికార్డ్: జపాన్ అనాన్‌పై సోలోగా రెబల్ స్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

తర్వాతి కథనం
Show comments