Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ శివార్లలోని చిరుతపులి హల్‌చల్, భయాందోళనలో ప్రజలు

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2020 (15:55 IST)
గత కొన్ని నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో చిరుతపులులు అక్కడక్కడా జనావాసంలోకి వచ్చి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర శివార్లలోని ప్రజలను చిరుతపులి మరోసారి భయాందోళనకు గురిచేసింది. రెండు నెలల క్రితం నగర శివార్లలో దర్శనం ఇచ్చిన చిరుతపులి మరోసారి కనిపించి కలకలం రేపింది.
 
నగరంలోని రాజేంద్రనగర్ వాలంతరీ రైస్ రీసెర్చ్ సెంటర్ సమీపంలో చిరుత సంచరిస్తున్నది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో చిరుతపులి రెండు లేగదూడలను చంపినట్లు స్థానికులు గుర్తించారు. ఈ సమాచారాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేయగా వారు వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది ఆ ప్రాంతంలోని పులి జాడలను వెతికారు.
 
ఆ ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచించారు. దీంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా గత ఆగస్టులో కూడా రాజేంద్ర నగర్‌లో చిరుతపులి సంచరించింది.
 
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments