Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునుగోడులో బీజేపీ గెలిస్తే తెరాస ప్రభుత్వం పతనం ఖాయం : రోజగోపాల్ రెడ్డి

Webdunia
ఆదివారం, 28 ఆగస్టు 2022 (17:24 IST)
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెరాస ప్రభుత్వం కుప్పకూలిపోతుందని ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ, తన రాజీనామాతో మునుగోడుకు జరిగే ఉప ఎన్నిక ఫలితంపై దేశం యావత్తూ ఆసక్తిగా ఎదురు చూస్తుందన్నారు. ఇక్కడే జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థి గెలిస్తే మాత్రం తెరాస ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్నారు. 
 
అదేసమయంలో తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు తాను మునుగోడును వదిలిపెట్టి వెళ్లబోనని ఆయన స్పష్టం చేశారు. తెరాసలో చేరితేనే విపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తారని ఆరోపించారు. అసలు తెరాస ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌తో మాట్లాడే దమ్మూ ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments