Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

త్రిష దృష్టంతా కెరీర్‌పైనే.. రాజకీయాల్లోకి రారు : తల్లి ఉమ

Trisha neckles
, గురువారం, 25 ఆగస్టు 2022 (10:51 IST)
సినీ నటి త్రిష రాజకీయాల్లోకి రానున్నారని, ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. వీటిని త్రిష స్వయంగా తోసిపుచ్చారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. పైగా, ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో అర్థం కావడం లేదన్నారు. ఇపుడు ఈ వార్తలపై త్రిష తల్లి ఉమ కూడా స్పందించారు. 
 
తన కుమార్తె పొలిటికల్ ఎంట్రీ గురించి వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. అవన్నీ ఊహాగానాలే అని, వాటిని నమ్మొద్దని అన్నారు. తన కుమార్తె త్రిషకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనగానీ, సమయంగానీ లేదన్నారు. ఇలాంటి పుకార్లు ఎవరు పుట్టిస్తారో తెలియని పేర్కొంటూ అసహనం వ్యక్తం చేశారు. 
 
పైగా ప్రస్తుతం సినీ కెరీర్‌పైనే దృష్టి పెట్టిందని ఆమె వివరించారు. తాను నటించే అన్ని భాషల్లో మంచి పేరు తెచ్చుకోవాలన్నదే ఆమె ఆశయం అని తెలిపారు. త్రిష ప్రస్తుతం మణిరత్న దర్శకత్వంలో తెరకెక్కిన "పొన్నియన్ సెల్వన్" అనే చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ మంత్రివర్గ సమావేశం వాయిదా