Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పటికే పెళ్లయింది.. అయినా ఆ అమ్మాయిపై మనసుపడ్డాడు.. చివరకు...

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (09:14 IST)
ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. తనను ప్రేమ పేరుతో ఓ వివాహితుడు మోసం చేయడాన్ని జీర్ణించుకోలేని ఆ యువతి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖమ్మం జిల్లాలలోని మాలబంజరకు చెందిన డిగ్రీ విద్యార్థిని తంబల్ల రత్నకుమారి(24) అనే యువతి ఖమ్మంలోని ఓ షాపింగ్‌ మాల్‌లో సహాయకురాలిగా చేస్తూ వచ్చింది. 
 
ఆ సమయంలో నగరానికి చెందిన ఆటో డ్రైవర్‌ కర్రి సంజయ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అదికాస్తా వారిద్దరి మధ్య ప్రేమగా మారింది. కానీ అతనికి అప్పటికే పెళ్లయింది. ఈ విషయాన్ని రత్నకుమారికి సంజయ్ చెప్పలేదు. పైగా, యువతి అందంగా ఉండటంతో సంజయ్ కూడా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. 
 
ఇంతలో కొత్తగూడెంలో ఉంటున్న సొంత బావమరిది కర్ణ ప్రకాశ్‌ వచ్చి రత్నకుమారిని మందలించాడు. ఇప్పటికే పెళ్లయిన తన బావతో సన్నిహితంగా ఎందుకు ఉంటున్నావని బెదిరించాడు. అసలు విషయం తెలిసి మనస్తాపం చెందిన రత్నకుమారి ఈ నెల 8న స్వగ్రామానికి వచ్చింది. 
 
మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు కొత్తగూడెం, అక్కడ్నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. ఆమె అక్కడ చికిత్సపొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలి బాబాయి ఫిర్యాదుతో సంజయ్‌, అతని బావమరిది ప్రకాశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments