Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపరిచితుల ఫోన్‌ వస్తే వెంటనే మాకు సమాచారమివ్వండి: సైబరాబాద్‌ పోలీసులు

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (10:27 IST)
ప్రజలు సైబర్‌ నేరాల బారిన పడి మోసపోకుండా ఉండటానికి సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు  వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ల గురిం చి ఆరా తీయడానికి, నిజానిజాలు తెలసుకోవడానికి సైబర్‌ క్రైమ్‌ విభాగంలో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు.

ప్రజల నుంచి వచ్చే ఫోన్లు రిసీవ్‌ చేసుకోవడానికి, అనుమానాలను నివృత్తి చేయడానికి ఒక ల్యాండ్‌లైన్‌, మరొక మొబైల్‌తో హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేశారు. సైబర్‌ క్రైమ్‌పై అవగాహన ఉన్న సిబ్బందిని ఉదయం 9:00 నుంచి రాత్రి 8:00 వరకు ప్రజలకు అందుబాటులో ఉంచారు.

ప్రజల నుంచి వచ్చే ఫోన్లను రిసీవ్‌ చేసుకొని వారి అనుమానాలను నివృత్తి చేస్తారు. తద్వారా ప్రజలు సైబర్‌ నేరాల బారినపడకుండా, నేరగాళ్ల చేతికి చిక్కి రూ. లక్షల్లో నష్టపోకుండా ముందుగానే నివారించొచ్చు.

ఈ మేరకు ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నంబర్లను సైబర్‌ క్రైమ్‌ విభాగం వారు సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఫోన్‌లోనే కాకుండా.. నెటి జన్లు ఆన్‌లైన్‌లో కూడా సంప్రదించి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు.
 
సంప్రదించాల్సిన  ఫోన్‌ నంబర్‌లు..
మొబైల్‌ నంబర్‌- 9490617310
ల్యాండ్‌లైన్‌ - 04027854031
sho-cybercrimes@tspolice.gov.in
NCR Portal:https://cybercrime.gov.in

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments