Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మొబైల్ కు ఫోన్ చేయాలంటే.. ల్యాండ్ లైన్ లో జీరో నొక్కాల్సిందే

మొబైల్ కు ఫోన్ చేయాలంటే.. ల్యాండ్ లైన్ లో జీరో నొక్కాల్సిందే
, శుక్రవారం, 15 జనవరి 2021 (14:15 IST)
ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ల్యాండ్‌లైన్ వినియోగదారులంతా  ల్యాండ్‌లైన్ నుంచి ఏ మొబైల్ నంబరుకు ఫోన్ చేయాలన్నా ముందుగా ‘జీరో’ నొక్కాల్సివుంటుంది.

డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్(డాట్) గత నవంబరులో ల్యాండ్ లైన్ వినియోగదారులు ఏ మొబైల్ నంబరుకు ఫోను చేయాలన్నా ముందుగా సున్నా నంబరు నొక్కాలని తెలిపింది. ఈ విధానం ఈరోజు నుంచి అమలులోకి వచ్చింది. టెలికం ఆపరేటర్స్ తమ వినియోగదారులకు ఈ సమాచారాన్ని తెలియజేసేందుకు అన్నిఏర్పాట్లు చేశాయి. 
 
ఎయిర్‌టెల్ తన ఫిక్స్‌డ్ లైన్ యూజర్స్‌కు ఈ విషయాన్ని తెలియజేస్తూ... డాట్ ఆదేశాలను అనుసరించి 2021, జనవరి 15 నుంచి ఏ ల్యాండ్‌లైన్ నుంచి అయినా మొబైల్‌కు పోన్ చేయాలంటే ముందుగా జీరో ప్రెస్ చేయడం తప్పనిసరి అని తెలిపింది.

ఇదేవిధంగా జియో కూడా తన ఫిక్స్‌డ్ ల్యాండ్ లైన్ యూ‌జర్స్‌కు దీనికి సంబంధించిన మెసేజ్ పంపించింది. కాగా ఈ విధానం కేవలం ల్యాండ్ లైన్‌లకు మాత్రమే వర్తిస్తుంది. మొబైల్ నుంచి ల్యాండ్‌లైన్‌కు ఫోన్ చేయాల్సివచ్చిన్పుడు ఈ విధానం అనుసరించాల్సిన అవసరం లేదు.

డాట్ తెలిపిన వివరాల ప్రకారం ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్‌కు కాల్ చేసేందుకు తీసుకువచ్చిన ఈ విధానం వలన మొబైల్ సర్వీసెస్ కోసం టెలికం కంపెనీలకు వీలైనంత అత్యధిక నంబర్లు రూపొందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబుకు జైలు రెడ్డి మార్పు పాఠాలా? బెయిలు పక్షికి భయం వల్ల మతిచెడిందా !?: టిడిపి నేత డా. సుధాకర్ రెడ్డి వ్యంగాస్త్రాలు