Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైసెన్స్ లేని యువతికి బైకిచ్చి జైలుపాలైన హైదరాబాద్ వాసి!

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (09:07 IST)
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపట్ల హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో లైసెన్స్‌ లేని యువతికి వాహనం ఇచ్చిన వ్యక్తిని జైలుకు పంపించారు. 
 
ఈనెల 20న రేష్మ (20) స్నేహితులతో కలిసి మియాపూర్‌లో ఓ థియేటర్‌లో సినిమా చూశారు. తిరిగొచ్చే క్రమంలో స్నేహితుల్లో ఒకరైన అజయ్‌సింగ్‌ నడుపుతున్న స్కూటీపై ఆమె వెనుక కూర్చొంది. రాత్రి 11.40 గంటల సమయంలో మార్గమధ్యలో జలమండలి కార్యాలయం వరకు రాగానే తాను బండి నడుపుతానని వాహనం తీసుకుంది. 
 
కొంతదూరం నడిపిన అనంతరం వాహనం అదుపు తప్పి హైదర్‌నగర్‌ వద్ద ఇసుక లారీ చక్రాల కింద పడిపోవడంతో ఆమె చనిపోయింది. రేష్మకు బండి నడపడం రాదు. లైసెన్స్‌ కూడా లేదు. ఈ విషయం తెలిసీ, వాహనం ఇచ్చిన అజయ్‌సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి సోమవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. లారీ డ్రైవర్‌ కృష్ణ పరారీలో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments