లైసెన్స్ లేని యువతికి బైకిచ్చి జైలుపాలైన హైదరాబాద్ వాసి!

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (09:07 IST)
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపట్ల హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో లైసెన్స్‌ లేని యువతికి వాహనం ఇచ్చిన వ్యక్తిని జైలుకు పంపించారు. 
 
ఈనెల 20న రేష్మ (20) స్నేహితులతో కలిసి మియాపూర్‌లో ఓ థియేటర్‌లో సినిమా చూశారు. తిరిగొచ్చే క్రమంలో స్నేహితుల్లో ఒకరైన అజయ్‌సింగ్‌ నడుపుతున్న స్కూటీపై ఆమె వెనుక కూర్చొంది. రాత్రి 11.40 గంటల సమయంలో మార్గమధ్యలో జలమండలి కార్యాలయం వరకు రాగానే తాను బండి నడుపుతానని వాహనం తీసుకుంది. 
 
కొంతదూరం నడిపిన అనంతరం వాహనం అదుపు తప్పి హైదర్‌నగర్‌ వద్ద ఇసుక లారీ చక్రాల కింద పడిపోవడంతో ఆమె చనిపోయింది. రేష్మకు బండి నడపడం రాదు. లైసెన్స్‌ కూడా లేదు. ఈ విషయం తెలిసీ, వాహనం ఇచ్చిన అజయ్‌సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి సోమవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. లారీ డ్రైవర్‌ కృష్ణ పరారీలో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments