Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణలో ఇన్ఫోసిస్ భారీ పెట్టుబడి.. ఏపీఐఐసీ నుంచి 447 ఎకరాలు

తెలంగాణలో ఇన్ఫోసిస్ భారీ పెట్టుబడి.. ఏపీఐఐసీ నుంచి 447 ఎకరాలు
, సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (13:01 IST)
కరోనా దెబ్బకు దాదాపు అన్ని రంగాలు కుదేలైనా.. ఐటీ రంగంపై మాత్రం ఆ ఎఫెక్ట్ అంతగా పడలేదు. వర్క్ ఫ్రం హోం ద్వారా ప్రొడక్టివిటీ ఏ మాత్రం తగ్గలేదని ఆయా కంపెనీలు చెబుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా తెలంగాణలో భారీగా పెట్టుబడులకు సిద్ధమైంది. 
 
రాష్ట్రంలో రూ. 2500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నిధులతో హైదరాబాద్‌లోని పోచారం క్యాంపస్‌ను విస్తరించనుంది ఇన్ఫోసిస్. దీంతో దాదాపు 20 వేల మందికి నూతనంగా ఉద్యోగవకాశాలు రానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
 
ఈ నిధులతో సాఫ్ట్ వేర్ డవలప్మెంట్ బ్లాక్‌లు, ఫుడ్ కోర్టులు, ఆడిటోరియం, ఇతర సదుపాయల కోసం బిల్డింగ్, మల్టిలెవల్ కార్ పార్కింగ్‌ను 329.84 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008వ సంవత్సరంలో ఏపీఐఐసీ నుంచి 447 ఎకరాలను తీసుకుంది. ఘటకేసర్ మండలంలోని పోచారం క్యాంపస్ 117.24 ఎకరాల్లో ఇప్పటికే విస్తరించి ఉంది. ఈ తాజా విస్తరణ ద్వారా మరో నాలుగు ఐటీ డవలప్మెంట్ బ్లాకులను కంపెనీ నిర్మించనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో పల్లెపోరు ప్రశాంతంగా ముగిసింది : ఎస్ఈసీ నిమ్మగడ్డ