Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

ఏం కష్టమో... బీజేపీ నేత ఇంట్లో నలుగురి ఆత్మహత్య

Advertiesment
Rajasthan
, సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (10:21 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి జరిగింది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ కుటుంబానికి చెందిన నలుగురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం విషాదం నింపింది. ఈ విషాదకర ఘటన రాష్ట్రంలోని సికార్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇటీవల తమ కుటుంబ సభ్యుడ్ని కోల్పోయిన బాధతోనే బలవన్మరణానికి పాల్పడినట్టు సమాచారం. మృతులను హనుమాన్ ప్రసాద్ సైనీ, మదన్‌లాల్‌ భార్య తారా, ఇద్దరు కుమార్తెలు అంజు, పూజలుగా గుర్తించారు.  
 
మదన్ లాల్ గత ఏడాది సెప్టెంబరులో పెద్ద కుమారుడిని కోల్పోయారు. దీంతో కుటుంబంలోని వారంతా తీవ్ర మానసిక వ్యధకు లోనయ్యారు. ఈ నేపథ్యంలోనే వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. 
 
మదన్ లాల్‌‌ సోదరుని కుమారుడు హనుమాన్ ప్రసాద్ సైనీ రాసినదిగా భావిస్తున్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ పెద్ద కుమారుడు మృతి చెందిన తర్వాత బతకాలనే ఆశలేదంటూ ప్రసాద్‌ ఈ లేఖలో పేర్కొన్నారు. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారి వీరేంద్ర శర్మ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టెన్త్ పరీక్ష రాసేందుకు వెళ్లిన యువతి భర్తతో ఇంటికి తిరిగొచ్చింది.. ఎక్కడ?