Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ కేసులో వీడని మిస్టరీ.. పరీక్షల్లో కనిపించని క్లోరోఫాం ఆనవాళ్లు

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (09:38 IST)
హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిలో జరిగిన అక్కా చెల్లెళ్ల అత్యాచారం కేసులోని మిస్టరీ ఇంకా వీడిపోలేదు. ఈ కేసులోని సరైన క్లూ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బాధితులిద్దరికీ జరిపిన పరీక్షల్లో క్లోరోఫాం ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. దీంతో దర్యాప్తు బృందాలు తలలు పట్టుకుంటున్నారు.
 
కాగా, ఇటీవల ఈ గాంధీ ఆసుపత్రిలో తనతో పాటు తన సోదరిపైనా సామూహిక అత్యాచారం జరిగిందంటూ ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఉదంతంపై స్పష్టత సాధించడంతో పాటు ఇప్పటికీ ఆచూకీ లేని మరో బాధితురాలిని కనిపెట్టడం కోసం మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. 
 
అయితే బాధితురాలు చెప్తున్న విషయాల్లో పొంతన లేకపోవడంతో ఇదంతా కల్లు ప్రభావంతో జరిగిన లొల్లిగానూ అనుమానిస్తున్న అధికారులు..ఆ కోణంలోనూ ఆరా తీస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో పని చేయకపోవడం, అదృశ్యమైన మహిళ వద్ద సెల్‌ఫోన్‌ లేకపోవడంతో దర్యాప్తు జఠిలంగా మారింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments