Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ గవర్నర్ తమిళిసైకు మాతృవియోగం

తెలంగాణ గవర్నర్ తమిళిసైకు మాతృవియోగం
, బుధవారం, 18 ఆగస్టు 2021 (09:29 IST)
తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తల్లి కృష్ణకుమారి కన్నుమూశారు. ఆమె వయసు 80 యేళ్లు. మంగళవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు లోనైన ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. 
 
అయితే, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కాసేపట్లో కృష్ణకుమారి భౌతికకాయాన్ని చెన్నైకి తరలించనున్నారు. 
 
కృష్ణకుమారి... మాజీ ఎంపి కుమారి నందన్ భార్య. తమిళిసై కృష్ణకుమారికి పెద్దకూతురు. గవర్నర్ తల్లి మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2860 కోట్ల రూపాయలను సమీకరించిన నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌