Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాదులో మద్యం తాగి వాహనం నడిపిన 308 మందికి జైలు శిక్ష

హైదరాబాదులో మద్యం తాగి వాహనం నడిపిన 308 మందికి జైలు శిక్ష
, మంగళవారం, 17 ఆగస్టు 2021 (10:24 IST)
మద్యం సేవించి వాహనాలు నడిపినందుకు మొత్తం 308 మందికి ఒక రోజు నుండి 16 రోజుల వరకు జైలు శిక్ష విధించబడింది. ట్రాఫిక్ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆగస్టు 9 నుంచి 13 మధ్య జరిగిన వాహన తనిఖీలో మద్యం సేవించి డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దాదాపు 635 మంది పట్టుబడ్డారు.
 
మద్యం తాగి వాహనాలు నడిపిన 85 మందితో మియాపూర్ మొదటి స్థానంలో ఉంది, గచ్చిబౌలి, మాదాపూర్‌లో 46 మంది, కూకట్‌పల్లి నుండి 37 మంది, రాజేంద్రనగర్ నుండి 32 మంది, శంషాబాద్ నుండి 18 మంది, షాద్‌నగర్ నుండి 12 మంది ఉన్నారు.
 
పట్టుబడిన వారందరినీ కోర్టు ఎదుట హాజరుపరిచామని, వారికి మొత్తం రూ. 17.7 లక్షల జరిమానా విధించామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న దృష్ట్యా మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇన్నోవాలో గంజాయి ర‌వాణా... చెక్ పోస్ట్ క‌న్నుగ‌ప్పిన‌ మాఫియా