Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ సైబర్ క్రైమ్.. డిపాజిట్ చేస్తేనే ఆదాయం.. ఐదు లక్షలు గోవిందా!

Webdunia
మంగళవారం, 28 మార్చి 2023 (12:43 IST)
సైబర్ నేరాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా అబిడ్స్‌కు చెందిన యువతి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మి.. లక్షలు మోసపోయింది. ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులకు ప్రచారం చేస్తే రోజుకు వెయ్యి సంపాదించవచ్చునని ఆశచూపి.. రెండు వేల రూపాయలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, నెల తర్వాత రూ.28వేల ఆదాయం చూపించారు. ఆ సొమ్ము విత్ డ్రా చేసుకునేందుకు అదనంగా 50వేల రూపాయలను డిపాజిట్ చేయాలన్నారు. 
 
సంపాదన పెరుగుతున్న కొద్దీ డిపాజిట్ పెంచారు. ఇలా ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేయించుకుని ఖాతా రద్దు చేశారు. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. హైదరాబాదు నగరంలో చాలామంది ఇలా మోసపోయారు. బాధితుల్లో విద్యార్థినులు, ఉన్నత విద్యావంతులు, గృహిణులు వున్నారు. 
 
ఆన్ లైన్ వేదికగా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. నిరుద్యోగులు సులభంగా ఈ ఉచ్చులో పడుతున్నారు. అయితే సామాజిక మాధ్యమాలు, ఫోన్లకు ఇలాంటి ప్రకటనలు వస్తే నమ్మొద్దని సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. వాస్తవాలు తెలియకుండా పెట్టుబడి పెట్టవద్దని.. మోసపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments