Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ సైబర్ క్రైమ్.. డిపాజిట్ చేస్తేనే ఆదాయం.. ఐదు లక్షలు గోవిందా!

Webdunia
మంగళవారం, 28 మార్చి 2023 (12:43 IST)
సైబర్ నేరాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా అబిడ్స్‌కు చెందిన యువతి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మి.. లక్షలు మోసపోయింది. ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులకు ప్రచారం చేస్తే రోజుకు వెయ్యి సంపాదించవచ్చునని ఆశచూపి.. రెండు వేల రూపాయలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, నెల తర్వాత రూ.28వేల ఆదాయం చూపించారు. ఆ సొమ్ము విత్ డ్రా చేసుకునేందుకు అదనంగా 50వేల రూపాయలను డిపాజిట్ చేయాలన్నారు. 
 
సంపాదన పెరుగుతున్న కొద్దీ డిపాజిట్ పెంచారు. ఇలా ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేయించుకుని ఖాతా రద్దు చేశారు. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. హైదరాబాదు నగరంలో చాలామంది ఇలా మోసపోయారు. బాధితుల్లో విద్యార్థినులు, ఉన్నత విద్యావంతులు, గృహిణులు వున్నారు. 
 
ఆన్ లైన్ వేదికగా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. నిరుద్యోగులు సులభంగా ఈ ఉచ్చులో పడుతున్నారు. అయితే సామాజిక మాధ్యమాలు, ఫోన్లకు ఇలాంటి ప్రకటనలు వస్తే నమ్మొద్దని సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. వాస్తవాలు తెలియకుండా పెట్టుబడి పెట్టవద్దని.. మోసపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరెస్టు వారెంట్ కాదు.. సాక్షిగా సమన్లు జారీ చేసింది : సోనూసూద్

మీ ముఖ దర్శనం అవుతుంది సామీ... థ్యాంక్యూ మై బుజ్జి తల్లి... శోభిత పోస్టుపై చై స్పందన

పాకిస్తాన్ బోర్డర్‌లో తండేల్, నాగచైతన్య, సాయిపల్లవి నటన ఎలా వుంది? రివ్యూ

Thandel: తండేల్ ట్విట్టర్ రివ్యూ.. నాగ చైతన్య, సాయి పల్లవి నటనకు మంచి మార్కులు

Pushpa 2: పుష్ప ఫ్యాన్.. మహా కుంభమేళాలో డైలాగులతో ఇరగదీశాడు.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments