Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ సైబర్ క్రైమ్.. డిపాజిట్ చేస్తేనే ఆదాయం.. ఐదు లక్షలు గోవిందా!

Webdunia
మంగళవారం, 28 మార్చి 2023 (12:43 IST)
సైబర్ నేరాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా అబిడ్స్‌కు చెందిన యువతి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మి.. లక్షలు మోసపోయింది. ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులకు ప్రచారం చేస్తే రోజుకు వెయ్యి సంపాదించవచ్చునని ఆశచూపి.. రెండు వేల రూపాయలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, నెల తర్వాత రూ.28వేల ఆదాయం చూపించారు. ఆ సొమ్ము విత్ డ్రా చేసుకునేందుకు అదనంగా 50వేల రూపాయలను డిపాజిట్ చేయాలన్నారు. 
 
సంపాదన పెరుగుతున్న కొద్దీ డిపాజిట్ పెంచారు. ఇలా ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేయించుకుని ఖాతా రద్దు చేశారు. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. హైదరాబాదు నగరంలో చాలామంది ఇలా మోసపోయారు. బాధితుల్లో విద్యార్థినులు, ఉన్నత విద్యావంతులు, గృహిణులు వున్నారు. 
 
ఆన్ లైన్ వేదికగా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. నిరుద్యోగులు సులభంగా ఈ ఉచ్చులో పడుతున్నారు. అయితే సామాజిక మాధ్యమాలు, ఫోన్లకు ఇలాంటి ప్రకటనలు వస్తే నమ్మొద్దని సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. వాస్తవాలు తెలియకుండా పెట్టుబడి పెట్టవద్దని.. మోసపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments