Webdunia - Bharat's app for daily news and videos

Install App

వడదెబ్బకు విద్యార్థి మృతి - రూ.110 కోట్ల పరిహారం

Webdunia
మంగళవారం, 28 మార్చి 2023 (12:40 IST)
ఒక విశ్వవిద్యాలయానికి చెందిన కోచ్‌లు శిక్షణ సమయంలో అత్యంత కఠినంగా ప్రవర్తించారు. దీంతో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మండిపోయే ఎండలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో ఒక విద్యార్థి చనిపోయిన విషాదకర ఘటన జరిగింది. కోచ్‌ల నిర్లక్ష్యం వల్ల మృతుని కుటుంబానికి ఏకంగా రూ.110 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
తమ కుమారుడి మృతికి యూనివర్శిటీ యాజమాన్యమే కారణమంటూ విద్యార్థి కుటుంబ సభ్యులు ఆరోపించింది. దీంతో సదరు యూనివర్శిటీ రూ.14 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అమెరికాలోని కెంటకీ విశ్వవిద్యాలయంలో 2020లో రెజ్లింగ్ క్రీడకు సంబంధించిన యూనివర్శిటీలోని కోచ్‌లు కోచింగ్ నిర్వహించారు. అందులో బ్రేస్ అనే 20 యేళ్ళ విద్యార్థి పాల్గొనగా, ఈ కోచింగ్‌లో తీవ్రంగా అలసిపోయాడు. దాహార్తిని తీర్చుకునేందుకు కోచ్‌లను అభ్యర్థించారు. 
 
ఇందుకు వారు అంగీకరించలేదు. ఈ వడదెబ్బకు ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ కోర్టులో దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. బాధిత కుటుంబానికి 14 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించడంతో యూనివర్శిటీ అధికారులు అందుకు సమ్మతించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments