Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాకీ కాదు కామాంధుడు.. చెల్లి కుమార్తెపై అత్యాచారం..

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (08:43 IST)
హైదరాబాద్‌లో ఓ పోలీస్ కానిస్టేబుల్ కామాంధుడిగా మారిపోయాడు. 33 యేళ్ళ ఈ ఖాకీ కామాంధుడు ఏకంగా 12 యేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తుపాకీతో కాల్చి చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ ఘటన రెండు నెలల క్రితం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, సిఖ్‌విలేజ్‌కు చెందిన వరదరాజ్ సుదేశ్ ఉమేశ్ (33) అక్కడి పోలీస్ స్టేషనులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. 
 
అతడి సోదరి కూడా సమీపంలోనే నివసిస్తోంది. ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఇంట్లో ఒంటరిగా ఉన్న ఉమేశ్‌కు తన కుమార్తెతో భోజనం పంపించింది. ఇంటికి వచ్చిన బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఉమేశ్.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బెదిరిపోయిన బాలిక ఆ విషయాన్ని తనలోనే దాచుకుంది.
 
ఈ ఘటన తర్వాత ఉమేశ్ ఇంటికి వెళ్లమని తల్లి ఎన్నిసార్లు చెప్పినా వెళ్లేందుకు బాలిక నిరాకరించేది. దీంతో అనుమానం వచ్చిన తల్లి ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కుమార్తె చెప్పింది విని విస్తుపోయిన తల్లిదండ్రులు గురువారం బాలల హక్కుల సంఘంతోపాటు బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments