Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా సూది మందు సిద్ధం.. ఐదు రాష్ట్రాలకు తొలి బ్యాచ్ పంపిణీ!

కరోనా సూది మందు సిద్ధం.. ఐదు రాష్ట్రాలకు తొలి బ్యాచ్ పంపిణీ!
, గురువారం, 25 జూన్ 2020 (16:31 IST)
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న రెమిడిసీవర్ సంస్థ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు సూది మందును కనిపెట్టింది. ఈ సూది మందు తొలి బ్యాచ్‌ను త్వరలోనే ఐదు రాష్ట్రాలకు పంపించనుంది. 
 
కోవిఫర్‌ బ్రాండ్‌ పేరుతో తొలి బ్యాచ్‌గా తయారు చేసిన 20 వేల ఇంజక్షన్లను తెలంగాణలోని హైదరాబాద్‌తోపాటు కరోనాతో ప్రభావితమైన మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. మరో మూడు, నాలుగు వారాల్లో లక్ష ఇంజక్షన్లు తయారు చేయనున్నట్లు పేర్కొంది. 
 
తర్వాత బ్యాచ్‌ కరోనా ఔషధాన్ని కోల్‌కతా, ఇండోర్‌, భోపాల్‌, లక్నో, పాట్నా, భువనేశ్వర్‌, రాంచీ, విజయవాడ, కోచి, తిరువనంతపురం, గోవాకు సరఫరా చేయనున్నట్లు హెటిరో వెల్లడించింది. 
 
100 మిల్లీగ్రాముల ఈ ఇంజక్షన్‌ ధర రూ.5,400గా హెటిరో తెలిపింది.  ప్రస్తుతం ఈ కరోనా ఇంజక్షన్‌ ప్రభుత్వం, దవాఖానల్లోనే అందుబాటులో ఉంటుందని, మందుల షాపుల్లో ఇప్పుడే లభించవని పేర్కొంది. 
 
మరోవైపు ఇదే జనరిక్‌ మందును తాము కూడా తయారు చేస్తున్నట్లు అమెరికా ఫార్మా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న సిప్లా తెలిపింది. ఇంజక్షన్‌ ధర మాత్రం రూ.5000 లోపే ఉంటుందని చెప్పింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెద్ద కుమార్తెను రేప్ చేసి జైలుకెళ్లి.. తిరిగివచ్చి చిన్న కుమార్తెపై తండ్రి లైంగికదాడి