Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హీరోయిన్‌ను పెళ్ళిచూపులు చూసిన కిడ్నాపర్లు, ఎక్కడ?

హీరోయిన్‌ను పెళ్ళిచూపులు చూసిన కిడ్నాపర్లు, ఎక్కడ?
, గురువారం, 25 జూన్ 2020 (16:37 IST)
తెలుగుతో పాటు తమిళంలో నటించారు నటి పూర్ణ. అతి తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించుకున్నారు. డ్యాన్సర్‌గా కొన్ని స్టేజ్ షోలు కూడా చేశారు పూర్ణ. అయితే పూర్ణను కొచ్చి గ్యాంగ్ టార్గెట్ చేసింది.
 
హీరోయిన్ పూర్ణను సినిమా స్టైల్‌లోనే ట్రాప్ చేసింది ఒక గ్యాంగ్. ప్రస్తుతం సినిమా ఆఫర్లు లేకపోవడంతో పూర్ణకు పెళ్ళి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే హీరోయిన్ కావడం.. అందంగా ఉండటంతో కొచ్చికి చెందిన రఫిక్, రమేష్, శివసదాన్, షరీఫ్ అనే నలుగురు వ్యక్తులు గ్యాంగ్‌గా ఏర్పడ్డారు.
 
ఒక ఫేక్ ప్రొఫైల్ పెట్టి పూర్ణ ఫ్యామిలీని ట్రాప్ చేశారు ఈ గ్యాంగ్. ఆమె ఇంటికి పెళ్ళి చూపులకు వెళ్ళారు. పెళ్ళిచూపుల్లో ఇచ్చి పుచ్చుకోవడాలు కూడా నడిచాయి. అయితే పూర్ణ వివరాలు తెలుసుకుని ఆ తరువాత బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారు. పూర్ణ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారు.
 
దీంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేరళలో వీరి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేరళలో పూర్ణ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్డౌన్ తర్వాత విదేశాల్లో విడుదలైన తొలి బాలీవుడ్ సినిమా ఏది?