Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మార్వో కార్యాలయానికి తాళం వేసిన వృద్ధురాలు .. ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (13:01 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఓ వృద్ధురాలు ఒక ఎమ్మార్వో కార్యాలయానికి తాళం వేసింది. కార్యాలయ అద్దె చెల్లించమని కొన్ని నెలలుగా మొత్తుకున్నప్పటికీ అధికారులు స్పందించలేదు. దీంతో విసిగిపోయిన ఇంటి యజమానురాలు కార్యాలయానికి తాళం వేసింది. 
 
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో జరిగింది. ఈ మండలానికి చెందిన చంద్రమణి అనే మహిళ తన ఇంటిని ఎమ్మార్వో కార్యాలయానికి అద్దెకు ఇచ్చారు. ఆరంభంలో సజావుగానే అద్దె చెల్లిస్తూ వచ్చిన అధికారులు ఆ తర్వాత చెల్లించడం మానేశారు. దీంతో అద్దె చెల్లించాలని ఆమె కార్యాలయ అధికారులు చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిరగింది. 
 
కానీ, వారు మాత్రం కనికరించలేదు. దీంతో విసుగు చెందిన చంద్రమణి.. మంగళవారం ఎమ్మార్వో కార్యాలయానికి ఏకంగా తాళం వేసింది. అద్దె చెల్లించేంత వరకు తాళం తీసే ప్రసక్తే లేదని భీష్మించుకూర్చొంది. ఇప్పటివరకు మొత్తం రూ.7,37,00 అద్దె చెల్లించాలని ఆమె వాపోయింది. ప్రభుత్వ అధికారులే ఇలా చేస్తే ఇంటి యజమానులు ఎవరికి చెప్పుకోవాలని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments