Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాదాద్రిలో పుష్పాలంకరణ సేవ దర్శనం

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (19:26 IST)
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి భక్తులకు ఆలయ అధికారులు కొత్తగా మరో సేవ దర్శనం ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం స్వామి వారి పుష్పాలంకరణ సేవ దర్శనం కల్పిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 5.30 నుంచి 6 గంటల వరకు స్వామివారి పుష్పాలంకరణ దర్శనం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ అలంకార సేవలో పాల్గొనాలనుకునేవారు రూ.300 టికెట్‌ తీసుకోవాలని చెప్పారు.
 
నారసింహుని పుష్పాలంకరణ సేవను శుక్రవారం ఉదయం ప్రారంభించారు. మొదటి రోజు ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికారి, పర్యవేక్షకులు, సిబ్బంది, స్థానికులు, భక్తులతో కలిపి మొత్తం 19 టికెట్లను విక్రయించారు.
 
ఘనంగా స్వాతి నక్షత్ర పూజలు. 
స్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయంలో 108 కలశాలకు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. కలశాల్లోని వివిధ ఫల రసాలు, పంచామృతాలు, శుద్ధ జలంతో స్వామి అమ్మవార్లను అభిషేకించారు. ఈ వేడుకల్లో ఆలయ ప్రధాన ఆచార్యులు, వేద పండితులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments