Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాదాద్రిలో పుష్పాలంకరణ సేవ దర్శనం

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (19:26 IST)
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి భక్తులకు ఆలయ అధికారులు కొత్తగా మరో సేవ దర్శనం ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం స్వామి వారి పుష్పాలంకరణ సేవ దర్శనం కల్పిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 5.30 నుంచి 6 గంటల వరకు స్వామివారి పుష్పాలంకరణ దర్శనం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ అలంకార సేవలో పాల్గొనాలనుకునేవారు రూ.300 టికెట్‌ తీసుకోవాలని చెప్పారు.
 
నారసింహుని పుష్పాలంకరణ సేవను శుక్రవారం ఉదయం ప్రారంభించారు. మొదటి రోజు ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికారి, పర్యవేక్షకులు, సిబ్బంది, స్థానికులు, భక్తులతో కలిపి మొత్తం 19 టికెట్లను విక్రయించారు.
 
ఘనంగా స్వాతి నక్షత్ర పూజలు. 
స్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయంలో 108 కలశాలకు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. కలశాల్లోని వివిధ ఫల రసాలు, పంచామృతాలు, శుద్ధ జలంతో స్వామి అమ్మవార్లను అభిషేకించారు. ఈ వేడుకల్లో ఆలయ ప్రధాన ఆచార్యులు, వేద పండితులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments