Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యాదాద్రి ఆలయానికి మేఘా 6 కేజీల బంగారం విరాళం

యాదాద్రి ఆలయానికి మేఘా 6 కేజీల బంగారం విరాళం
, గురువారం, 21 అక్టోబరు 2021 (09:38 IST)
యాదాద్రి ఆలయ విమాన గోపురం బంగారు తాపడానికి విరాళాలు భారీగా వస్తున్నాయి. వ్యాపార వేత్తలు, ప్రముఖులు ముందుకు వచ్చి కిలోల కొద్దీ బంగారాన్ని ఇస్తున్నారు. విరాళాలు ప్రకటించడంలో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌, మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌తో సన్నిహితంగా ఉండే కాంట్రాక్టు, కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు పోటీ పడుతున్నాయి. 
 
కాళేశ్వరం సహా అనేక కీలక ప్రాజెక్టులు నిర్మిస్తున్న మేఘా ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌ సంస్థ 6 కేజీల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ పుణ్యకార్యంలో పాలుపంచుకోవడం తమకు ఎంతో గౌరవప్రదమని సంస్థ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ రెడ్డి అన్నారు. త్వరలోనే ఆరు కేజీల బంగారం లేదా అందుకు సమానమైన మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేస్తామని తెలిపారు. 
 
అలాగే, ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులు, రోడ్లు, హైవేల పనులు చేస్తున్న కేఎన్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ కన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్స్‌‌‌‌‌‌‌‌ ఎండీ కామిడి నర్సింహారెడ్డి 2 కేజీల బంగారం విరాళంగా ప్రకటించారు. ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగే ప్రణీత్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌ ఎండీ నరేంద్ర కుమార్‌‌‌‌‌‌‌‌ కామరాజు 2 కిలోల బంగారం ఇస్తామని పేర్కొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, జలవిహార్‌‌‌‌‌‌‌‌ ఎండీ ఎన్‌‌‌‌‌‌‌‌వీ రామరాజు కిలో బంగారం ప్రకటించారు. 
 
ఇదిలావుంటే, విరాళాల సేకరణ కోసం యాదాద్రి ఆలయ ఆఫీసర్లు ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను తీసుకొచ్చారు. దీన్ని బుధవారం టెంపుల్ ఈవో గీతారెడ్డి విడుదల చేశారు. ప్రజలు నేరుగా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేసేందుకు వీలుగా అకౌంట్ నంబర్ తో పాటు ఐఎఫ్ఎస్సీ కోడ్ ను రిలీజ్ చేశారు. యాదగిరిగుట్టలోని ఇండియన్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేశారు. అకౌంట్ నంబర్ 6814884695, ఐఎఫ్ఎస్సీ కోడ్ IDIB000Y011ను అందుబాటులోకి తెచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ఎందుకు జరుపుతారంటే?!