Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (19:23 IST)
కరోనాతో నెలకొన్న పరిస్థితులు మెరుగుపడటం, కొత్త కేసులు తగ్గుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారి కట్టడి కోసం రాష్ట్రంలో విధించిన రాత్రి పూట కర్ఫ్యూని ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.

రాత్రి 10గంటల నుంచి ఉదయం 5గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న నైట్‌ కర్ఫ్యూకి సంబంధించి గతంలో ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల గడువు అక్టోబర్‌ 25తో ముగిసింది. దీంతో గత 10 రోజులుగా రాష్ట్రంలో నైట్‌ కర్ఫ్యూ ఉందా? లేదా? అనే అంశంపై ప్రజల్లో అయోమయానికి తోడు అనేక ఊహాగానాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రవికుమార్‌ జారీ చేసిన ఉత్తర్వులు వాటికి తెరదించాయి. అలాగే, రాష్ట్రంలో గుర్రపు పందేలు పునఃప్రారంభించుకొనేందుకు కూడా పలు నిబంధనలతో కూడిన అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది. గుర్రపు పందేలు నిర్వహించే ప్రదేశాల్లో సామర్థ్యానికి మించి జనం హాజరు కారాదని, అలాగే, వ్యాక్సినేషన్‌ పూర్తయిన వారినే అనుమతించాలని సూచించింది.

మరోవైపు, గురువారం కర్ణాటకలో 261 కొత్త కేసులు నమోదు కాగా.. ఐదుగురు మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 29,89,275కి చేరగా.. 38,095మంది మృతిచెందారు. ప్రస్తుతం అక్కడ 8267 క్రియాశీల కేసులు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments