Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (19:23 IST)
కరోనాతో నెలకొన్న పరిస్థితులు మెరుగుపడటం, కొత్త కేసులు తగ్గుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారి కట్టడి కోసం రాష్ట్రంలో విధించిన రాత్రి పూట కర్ఫ్యూని ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.

రాత్రి 10గంటల నుంచి ఉదయం 5గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న నైట్‌ కర్ఫ్యూకి సంబంధించి గతంలో ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల గడువు అక్టోబర్‌ 25తో ముగిసింది. దీంతో గత 10 రోజులుగా రాష్ట్రంలో నైట్‌ కర్ఫ్యూ ఉందా? లేదా? అనే అంశంపై ప్రజల్లో అయోమయానికి తోడు అనేక ఊహాగానాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రవికుమార్‌ జారీ చేసిన ఉత్తర్వులు వాటికి తెరదించాయి. అలాగే, రాష్ట్రంలో గుర్రపు పందేలు పునఃప్రారంభించుకొనేందుకు కూడా పలు నిబంధనలతో కూడిన అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది. గుర్రపు పందేలు నిర్వహించే ప్రదేశాల్లో సామర్థ్యానికి మించి జనం హాజరు కారాదని, అలాగే, వ్యాక్సినేషన్‌ పూర్తయిన వారినే అనుమతించాలని సూచించింది.

మరోవైపు, గురువారం కర్ణాటకలో 261 కొత్త కేసులు నమోదు కాగా.. ఐదుగురు మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 29,89,275కి చేరగా.. 38,095మంది మృతిచెందారు. ప్రస్తుతం అక్కడ 8267 క్రియాశీల కేసులు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments