Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సొంత చెల్లెలిని కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు..

సొంత చెల్లెలిని కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు..
, గురువారం, 28 అక్టోబరు 2021 (10:26 IST)
క్షణికావేశం కారణంగా ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. సొంత చెల్లెలు అని చూడకుండా అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు కసాయి అన్నయ్య. ఈ ఘటన కర్ణాటకలోని హుబ్లీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే నవలగుంద పట్టణంలోని కల్మేశ్వర గుడి ప్రాంతంలో మహంతేష్‌ శరణప్ప నవర అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడి చెల్లెలు శశికళకు వివాహం కాగా, ఇటీవల పుట్టింటికి వచ్చింది. అయితే ఓ విషయంపై అన్నాచెల్లెకు మధ్య వాగ్వాదం నెలకొంది.
 
అది చినికి చినికి పెద్దదైంది. దీంతో ఆవేశంతో రగిలిపోతున్న అన్న... చెల్లెల్ని కత్తితో పొడవడంతో చనిపోయింది. అనంతరం కత్తితో పాటు మహంతేష్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు.. చెల్లెలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీవోలను వెబ్​సైట్​లో ఉంచకపోవడంపై కౌంటర్!