Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మామయ్యా, అమ్మ మరొకడితో ఆటోలో ఎక్కి వెళుతోంది: దారి కాచి హత్య చేశారు

మామయ్యా, అమ్మ మరొకడితో ఆటోలో ఎక్కి వెళుతోంది: దారి కాచి హత్య చేశారు
, సోమవారం, 18 అక్టోబరు 2021 (19:52 IST)
తన సోదరి వేరొకరితో అక్రమ సంబంధం సాగిస్తుందని తెలిసి ఆ వ్యక్తిని హత్య చేసాడు ఆమె సోదరుడు. తన వెంట మరో ముగ్గురుని తీసుకుని వచ్చి అక్రమ సంబంధం నెరపుతున్న వ్యక్తిని చనిపోయేవరకూ కొట్టి చంపాడు. ఆ తర్వాత అతడి శవాన్ని తీసుకుని నేరుగా పోలీసు స్టేషనుకి వెళ్లి లొంగిపోయాడు.

 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. బెంగళూరులోని కోలారు జిల్లా మాలూరుకి చెందిన ఓ మహిళ వస్త్ర పరిశ్రమలో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకి రెండేళ్ల క్రితం తమిళనాడుకి చెందిన భాస్కర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దసరా పండుగ రోజు కూడా ఈ విషయమై భర్త ఆమెను నిలదీశాడు. దాంతో ఆగ్రహంతో ఆమె తన కుమారుడిని తీసుకుని బెంగళూరు వచ్చేసింది.

 
మరుసటి రోజు తన ప్రియుడితో కలిసి ఆటోలో ఎక్కి వెళ్లింది. దీన్ని గమనించిన ఆమె కుమారుడు విషయాన్ని తన మేనమామకి చేరవేశాడు. అంతే... ఆ మహిళ సోదరుడు మునిరాజు తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆటోలో వెళ్తున్న వారిద్దరినీ అటకాయించారు.

 
ఆటో నుంచి తన సోదరిని కిందకు దించి ఇంటికి పంపారు. ఆ తర్వాత ఆమెతో వివాహేతర సంబంధం సాగిస్తున్న భాస్కర్ ను గొడ్డును బాదినట్లు బాదారు. ఆ దెబ్బలకు తాళలేక అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి శవాన్ని తీసుకుని పోలీసు స్టేషనుకి వెళ్లి లొంగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పక్కనే పిల్లలున్నారని కూడా చూడకుండా ప్రియుడి కోసం భర్తను అలా చేసింది