తెలంగాణలో మరో ఐదు మద్యం డిపోలు

Webdunia
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (08:41 IST)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నీరా విధానం గురించి మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అధికారులతో సమీక్షించారు. ఇప్పుడున్న మద్యం డిపోలకు మరో 5 అదనంగా ఏర్పాటు చేసేందుకు తగిన స్థలాలను ఎంపిక చేయాలని ఆదేశించారు.

రాష్ట్రంలో ఇప్పుడున్న మద్యం డిపోలకు మరో ఐదు అదనంగా ఏర్పాటు చేసేందుకు తగిన స్థలాలను ఎంపిక చేయాలని అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నీరా విధానం గురించి రవీంద్రభారతిలోని మంత్రి కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. సేకరణ, నిల్వ, మార్కెటింగ్‌లతో పాటు నీరా కేఫ్‌ తదితర అంశాలపై చర్చించారు.

ఇప్పుడున్న మద్యం డిపోల నుంచి దుకాణాలకు చేరవేత కొంత ఇబ్బందిగా ఉందన్నారు. కొన్ని చోట్ల దూరం ఎక్కువ కావడంతో ఆలస్యం అవుతున్నందున కొత్తగా మరో ఐదు డిపోలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

హైదరాబాద్‌ నగర శివారులో మూడు, సూర్యాపేటలో ఒకటి, మంచిర్యాల ప్రాంతంలో మరొకటి ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలిసినవారికి వివరణ అవసరం లేదు, చెప్పినా వినరు : ఏఆర్ రెహమాన్

ప్రభాస్ ఖాతాలో అరుదైన రికార్డ్: జపాన్ అనాన్‌పై సోలోగా రెబల్ స్టార్

మన శంకర వర ప్రసాద్ గారు జీ5లో స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది

సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదె నిర్మిస్తోన్న రాకాస డేట్ ఫిక్స్

మీర్జాపురం రాణి కృష్ణవేణి అరుదైన భగీరథ ప్రయత్నం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

తర్వాతి కథనం
Show comments