కన్న కొడుకుని సిమెంట్ బిళ్లతో తల పగులగొట్టి హత్య చేసిన తండ్రి

Webdunia
బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (13:47 IST)
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గంగుబండ తండా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో తండ్రి, కొడుకుని కొట్టి చంపిన సంఘటన కలకలం రేపింది. గంగుబండ తండాకు చెందిన వడిత్య రవి (29) మద్యానికి బానిసై ప్రతిరోజు తండ్రితో గొడవ పడుతూ ఉండేవాడు. రోజు లాగానే ఈరోజు కూడా మద్యం మత్తులో ఉన్న రవి, తండ్రి మల్సూర్‌తో గొడవ పడటంతో తండ్రి మల్సూర్ కూడా మద్యం మత్తులో ఉన్నాడు.
 
కొడుకుతో విసిగిపోయిన తండ్రి సిమెంట్ బిళ్ళతో రవి తలపై గట్టిగా మోదడంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రవికి భార్య ఉంది. మద్యానికి బానిసైన రవి నుంచి భార్య ఐదు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మద్యానికి బానిసైన రవి తండ్రితో రోజూ గొడవ పడుతూ ఉండేవాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సొంత ఊరు తుమ్మన్ పేటలో పెళ్లి వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ

Laya: సాంప్రదాయబద్ధంగా జీవించే శివాజీ, లయ వాటిని బ్రేక్ చేస్తే?

Varalakshmi Sarath Kumar: వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర పై ల‌వ్ సాంగ్

వృద్దాప్యంలో విడాకులు ఎందుకు కోరుకుంటున్నారు? జబ్ ఖులి కితాబ్ ZEE5లో స్ట్రీమింగ్

109 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న మన శంకరవరప్రసాద్ గారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments