Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ డ్రగ్స్ కేసు : కీలక సూత్రధారి అరెస్టు

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (16:56 IST)
హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ సరఫరా కేసులో కీలక సూత్రధారి ఎడ్విన్‌ను నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్టు చేశారు. గోవా నుంచి హైదరాబాద్ నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న కేసులో ఎడ్విన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను శనివారం సాయంత్రం హైదరాబాద్ నగరానికి తీసుకునిరానున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న నారాయణ బోర్కర్‌ను నార్కోటిక్ విభాగం పోలీసులు గత మూడు నెలల క్రితం అరెస్టు చేసి విచారించారు. ఈ విచారణలో ఎడ్విన్ పేరును బహిర్గతం చేశాడు. బోర్కర్ ఇచ్చిన సమాచారంతో గోవాలో ఎడ్విన్‌పై నార్కోటిక్ విభాగం పోలీసులు నిఘా ఉంచారు. గత మూడు నెలలుగా సాగుతున్న ఈ నిఘాలో పోలీసుల కన్నుగప్పి ఎడ్విన్ తప్పించుకుని తిరుగుతున్నారు. 
 
ఈ క్రమంలో గత 15 రోజులుగా గోవాలోనే మకాం వేసిన నార్కోటిక్ పోలీసులు ఎడ్విన్ కదలికలపై నిఘా వేసి అరెస్టు చేశారు. గోవా నుంచి శనివారం రాత్రికి హైదరాబాద్ నగరానికి తీసుకునిరానున్నారు. కాగా, దేశ వ్యాప్తంగా డ్రగ్స్ సరఫరాలో ఎడ్విన్ ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments