Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ హాస్టల్‌లో ఫుడ్‌పాయిజనింగ్

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (16:33 IST)
శ్రీకాకుళంలోని ట్రిపుల్ ఐటీలోని హాస్టల్‌లో వడ్డించే ఆహారం కలుషితమైంది. ఈ ఆహారాన్ని ఆరగించిన పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కొందరు విద్యార్థులకు వాంతులు విరేచనాలు కావడంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
 
శుక్రవారం సాయంత్రం వంద మందికిపై విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వీరిని శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత తిరిగి హాస్టల్‌కు తరలించారు. గడిచిన 24 గంటల్లో ఏకంగా 336 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందినట్టు చికిత్స పొందినట్టు రికార్డులు చెబుతున్నాయి. 
 
మరోవైపు, ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అరకొరగా వైద్యం అందించిన వైద్య సిబ్బందిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వైద్య సిబ్బందిని పిలిపించి విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో పలువురు విద్యార్థులకు మరింత మెరుగైన వైద్యం కావాల్సి రావడంతో శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments