Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ హాస్టల్‌లో ఫుడ్‌పాయిజనింగ్

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (16:33 IST)
శ్రీకాకుళంలోని ట్రిపుల్ ఐటీలోని హాస్టల్‌లో వడ్డించే ఆహారం కలుషితమైంది. ఈ ఆహారాన్ని ఆరగించిన పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కొందరు విద్యార్థులకు వాంతులు విరేచనాలు కావడంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
 
శుక్రవారం సాయంత్రం వంద మందికిపై విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వీరిని శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత తిరిగి హాస్టల్‌కు తరలించారు. గడిచిన 24 గంటల్లో ఏకంగా 336 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందినట్టు చికిత్స పొందినట్టు రికార్డులు చెబుతున్నాయి. 
 
మరోవైపు, ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అరకొరగా వైద్యం అందించిన వైద్య సిబ్బందిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వైద్య సిబ్బందిని పిలిపించి విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో పలువురు విద్యార్థులకు మరింత మెరుగైన వైద్యం కావాల్సి రావడంతో శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments