Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం- ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి

Advertiesment
road accident
, శుక్రవారం, 28 అక్టోబరు 2022 (22:55 IST)
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. భారతీయ విద్యార్థులు ప్రయాణిస్తున్న మినీ వ్యాన్‌ను ట్రక్కు ఢీకొనడంతో ఘోర ప్రమాదం సంభవించింది. మృతి చెందిన విద్యార్థులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. 
 
ప్రమాద సమయంలో మినీ వ్యాన్‌లో ఎనిమిది మంది ఉన్నట్లు సమాచారం. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
 
మృతులు పావని వరంగల్ వాసిగా గుర్తించారు. ప్రేమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ వాసిగా తెలిసింది. మరొకరు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కడియపులంకకు చెందిన సాయి నరసింహులుగా గుర్తించారు.
 
మరోవాహనంలోని డ్రైవర్‌ ఒక్కడే ఉన్నట్టుగా తెలిసింది. 46 ఏళ్ల ఆ వ్యక్తి కారు ఓనర్‌గా తెలిసింది. అతడు కూడా తీవ్రంగా గాయపడటంతో చికిత్స కోసం మెడికల్ సెంటర్‌కు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్విటర్ నుంచి ఉద్వాసనకు గురైన పరాగ్ అగర్వాల్‌కు రూ.344 కోట్ల పరిహారం