Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరకట్న వేధింపులు... ప్రేమ పెళ్లి చేసుకున్నా వేధింపులు.. చివరికి?

Webdunia
సోమవారం, 3 మే 2021 (18:55 IST)
వరకట్న వేధింపులు ఓ యువతి ప్రాణాలు తీసింది. పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి ఏడాది తిరక్కుండానే కన్ను మూసిన విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. హుజూర్ నగర్, సుందరయ్య నగర్‌కు చెందిన ఆత్కూరి సుజాత రెండో కుమార్తె మౌనిక (19) అదే ప్రాంతానికి చెందిన పంగ నాగరాజు అనే యువకుడిని ప్రేమించి, పెద్దలను ఒప్పించి గతేడాది మే 14న పెళ్లి చేసుకుంది.
 
పెళ్లి సమయంలో వరకట్నం కింద 20 కుంటల భూమిని ఇచ్చేందుకు మౌనిక తల్లి సుజాత ఒప్పుకుంది. గత కొంతకాలంగా నాగరాజు మౌనికను వేధించటం మొదలెట్టాడు. పెళ్లి సమయంలో ఇస్తానన్న భూమిని తన పేరున రిజష్ట్రేషన్ చేయించుకు రమ్మనమని వేధించసాగాడు
 
భర్త వేధింపులు భరించలేని మౌనిక మే 1 శనివారం సాయంత్రం పురుగుల మందు తాగి బలవన్మరణానికి ప్రయత్నించింది. గమనించిన భర్త ఆమెను వెంటనే స్ధానిక ఆస్పత్రికి తరలించాడు. కానీ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments