Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో నేటి నుంచి వృద్ధులకు కరోనా టీకాలు

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (07:44 IST)
తెలంగాణా రాష్ట్రంలో నేటి నుంచి వృద్ధులకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. వృద్ధులతో పాటు 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా టీకా వేయనున్నారు. కొవిన్ 2.0 యాప్‌లో సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదు చేసుకున్న వారికి ఎంపిక చేసుకున్న టీకా కేంద్రాల్లో టీకాలు వేయనున్నట్టు చెప్పారు.
 
ఈ దశలో మొత్తం 50 లక్షల మందికి టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలివారం మాత్రం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారికి మాత్రమే టీకా వేస్తారు. కార్యక్రమం సాఫీగా సాగితే టీకా కేంద్రాలకు నేరుగా వచ్చే వారికి కూడా టీకా వేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
 
తొలి రోజు రాష్ట్రవ్యాప్తంగా 48 ప్రభుత్వ, 45 ప్రైవేటు ఆసుపత్రులలో టీకాలు వేయనున్నారు. ఒక్కో కేంద్రంలో గరిష్టంగా 200 మందికి టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో టీకాను ఉచితంగానే వేయనుండగా, ప్రైవేటు ఆసుపత్రులలో రూ. 250 వసూలు చేస్తారు. 
 
అంతకుమించి వసూలు చేయడానికి వీల్లేదని అధికారులు హెచ్చరించారు. సేవా రుసుము కింద వసూలు చేసే వంద రూపాయలను కూడా ఆసుపత్రులు పూర్తిగా మాఫీ చేయవచ్చని, లేదంటే కొంత తగ్గించి కూడా వసూలు చేసుకోవచ్చన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments